హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. 9, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. హోంశాఖలోని పోలీస్ అధికారుల విభజన, వాణిజ్య పన్నులతో పాటు విద్యుత్ అంశాలు, బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.