న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో కొవిడ్ టీకాల వినిమయం 100 కోట్ల డోసులకు చేరువైంది. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలకు రెండో డోసు పంపిణీపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు సలహాలివ్వాలని రాష్ర్టాలను కోరింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని సూచించే ‘ఆర్’ విలువ దేశంలో సెప్టెంబర్ నుంచి 1లోపే ఉన్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది.