న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరోవైపు ఉమాశంకర్ వ్యాస్ అనే జ్యూడిషియల్ అధికారి రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా, విక్రమ్ డీ చౌహాన్ అనే న్యాయవాది అలహాబాద్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది.