యాదాద్రి భువనగిరి : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చే రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ తేల్చిన 24వేల కోట్ల నిధులు తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదం పరిష్కరించకపోగా పెద్దగా చేసి చూపుతుందన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంట మొత్తాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎత్తిచూపకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ ఎంపీలందరం కొట్లాడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అందుకు భిన్నంగా వ్యవరిస్తున్నారని పేర్కొన్నారు.