నోరు తెరిస్తే అబద్ధం.. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ఎత్తుగడ.. రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయంగా బలపడాలనే బక్వాస్ వ్యూహం.. ఇదీ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు లెక్కలేనన్నిసార్లు ప్రశంసించారు. కొత్త రాష్ట్రమైనా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్వన్గా రాణిస్తున్నదని కొనియాడారు. ఆ ప్రశంసలు, అభినందనలు కండ్లముందే కనిపిస్తున్నా రాష్ట్ర బీజేపీ నేతలు చూడ నిరాకరిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి మొదులుకొని కేంద్ర మంత్రులదాకా, నీతి ఆయోగ్ నుంచి నాబార్డువరకు, ఎఫ్సీఐ నుంచి ఫైనాన్స్ కమిషన్ వరకు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన కితాబులు, ప్రశంసలు, పొగడ్తలు ఒకసారి చూద్దాం.
–హైదరాబాద్, జనవరి 6, (నమస్తే తెలంగాణ)
బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ!
తెలంగాణ రాష్ట్రంలో అది ప్రతిపక్షం!
తాము ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, వినూత్న సంక్షేమ పథకాలను ప్రధాని మొదలుకొని.. కేంద్రమంత్రుల దాకా వేనోళ్ల కొనియాడుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అమోఘం అని కేంద్రమంత్రులు కితాబిస్తుంటే.. అభివృద్ధే లేదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు వాస్తవాలను కప్పిపెడుతున్నారు. ఎవరి మాట నిజం?
కేంద్ర మంత్రులదా? రాష్ట్ర బీజేపీ నేతలదా?
ఎవరు అబద్ధం చెప్తున్నారు? కేంద్రంలోని పెద్దలా? రాష్ట్రంలోని కురచబుద్ధులా?
ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వైశాల్యం, జనాభా, ఆదాయపరంగా పెద్ద రాష్ర్టాలు దశాబ్దాలుగా సాధించలేనిది తెలంగాణ ఆవిర్భంచిన ఆరున్నరేండ్లకే సాధించింది. తెలంగాణలో వందశాతం రక్షిత తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది.
-ట్విట్టర్లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. (22/1/2021)
తెలంగాణలోని బోయినపల్లి మార్కెట్లో చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు. వృథాగా పడేసే కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తుతోపాటు బయోగ్యాస్ ఉత్పత్త్తి చేస్తూ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ విధానంలో వ్యర్థాలను ఉపయోగించుకోవడం దేశానికే ఆదర్శం. చెత్తను బంగారంగా మార్చే ప్రయాణమిది.
-ప్రధాని నరేంద్రమోదీ. (మన్కీ బాత్ 1-2-2021)
టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉన్నది. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలు. డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనం. ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నం. తెలంగాణ రాష్ట్రం అర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నది.
నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరుస్తున్నది.
-ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.(అగ్రిటెక్ సౌత్-2020 సదస్సు- హైదరాబాద్. 23-02-2020)
తెలంగాణ రాష్ట్రం ఒకపెద్ద వాటర్ బ్యాంక్. గోదావరికి నడక నేర్పిన పాలకుడు కేసీఆర్. ఆరేండ్ల కిందట గోదావరిలో చుక్క నీరు లేదు. ఇప్పుడు నది పొడవునా నీరే.
ఐటీలో తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. ఈ రాష్ట్ర ఐటీ విధానం దేశానికే ఆదర్శం. విదేశాంగ విధానం మాదిరిగానే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ జాతీయ ఐటీ పాలసీపై దృష్టి సారించాలి. ఐటీరంగ ఫలాలను అందించడంలో మంత్రి కేటీఆర్ తెలంగాణను ఒక ఉదాహరణగా నిలుపుతున్నారు. ఈ ఐటీ పాలసీ ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ మొదలు డాటా ప్రొటెక్షన్, సెమీ కండక్టర్ ఫాబ్రికేషన్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెన్షన్, ఇన్క్లూజన్పై మంత్రి కేటీఆర్తో చర్చించడం చాలా ఉత్సాహాన్ని కలిగించింది.
ప్రధానమంత్రి స్వనిధిలోనూ తెలంగాణ నంబర్వన్గా నిలిచింది. ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలివ్వడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. వీధి వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులలో కూడా మొదటి స్థానం సాధించింది.
-కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా (9-9-2021)
తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అయినా అభివృద్ధిలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా 9 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్నది. ప్రభుత్వ నూతన పాలసీలు, పరిశ్రమలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.
బాలింతలు, గర్భిణిల కోసం తెలంగాణ ప్రభుత్వ పథకాలు భేష్.
తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లలో తనదైన విధానాలతో పెట్టుబడుల ఆకర్షణలో అన్ని రాష్ర్టాలతో పోటీ పడుతున్నది.
-కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (7/2/2020)
తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికి వినియోగించడంలో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది.
-వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండే. (డబ్ల్యూఏఎఫ్ సదస్సుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ను ఆహ్వానిస్తూ రాసిన లేఖలో, 6/1/2021)
చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
–జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ విలాస్ దొనఫీ. (16/9/2021)
తెలంగాణ రాష్ట్ర ఆన్లైన్ ఆడిట్ విధానం దేశానికే ఆదర్శం.
-కర్ణాటక పంచాయతీరాజ్ ఆడిట్శాఖ ఉన్నతాధికారుల బృందం.(హైదరాబాద్, 14/10/2020)
పశు సంరక్షణ, సంక్షేమం, మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల పనితీరు భేష్.
-ఉత్తరప్రదేశ్ అధికారుల అధ్యయన బృందం.(హైదరాబాద్ 14/10/2021)
తెలంగాణలో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషంగా పంటలు పండించే వాతావరణం నెలకొన్నది.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా.(హైదరాబాద్, 3/3/2020)
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అయింది.
-మహారాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విజయ్ ఓడేటి వార్.(మంచిర్యాల, 16/2/2021)
కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడి విధానాన్ని మహారాష్ట్రలో అనుసరిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణం. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ నైపుణ్యం ప్రపంచానికే అదర్శం. సాగు,తాగు నీటి రంగాలకు నీటిని మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్ల పనితీరు ఎంతో ప్రశంసనీయం.
-అనిల్ బహుదూరె. (వేములవాడ, 22/11/2021)
రైతుబంధు తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (ఆర్థిక సర్వే 2019-20 నివేదిక. 1/2/2021)
ఈ-నామ్ అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నది.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. ( 22/10/2020)
గ్రామీణాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి.
-కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. (సర్పంచ్లతో జూమ్ మీటింగ్లో 29-17-2021)
మూసీనది సుందరీకరణ భేష్.
-జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ వికాస్రావు అఫ్జల్ పుర్కర్ (హైదరాబాద్, 12/1/2021)
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్కిట్, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం తెచ్చిన పథకాలు భేష్. న్యూట్రీ గార్డెన్తో పిల్లలకు, గర్భిణిలకు ఎంతోమేలు జరుగుతున్నది. ఇలాంటి న్యూట్రీ గార్డెన్ దేశంలో ఎక్కడాలేదు, తెలంగాణ దేశానికే దిక్సూచి.
-మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ.(హైదరాబాద్,13-9-2021)
మిషన్ భగీరథ పథకం అద్భుతం. మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం.
-కేంద్ర జల్ జీవన్ మిషన్ టాస్క్ఫోర్స్ బృందం. (హైదరాబాద్,21/1/2020)
కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటిరంగంలో గొప్ప ఆవిష్కరణ.
-ఆర్బీ కౌల్, మనోహరన్.(సిద్దిపేట జిల్లా మర్కూర్, 23/10/2020)
ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది.
-ఎఫ్సీఐ రీజినల్ మేనేజర్ ఆశ్వినికుమార్. (హైదరాబాద్, 6/7/2021)
పశుసంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయి.
-కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రుపాలా
(రాష్ర్టాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో.. 7/9/2021)
రెండున్నరేండ్లలో 50 టీఎంసీల సామర్థ్యంగల మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తిచేయడం గొప్ప విషయం. ఇది ఒక రికార్డు.
-నాబార్డు చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల.(సిద్దిపేట జిల్లా తొగుట, 3/12/2021)
ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో అగ్రస్థానంలో నిలిచింది.
-ఐక్యరాజ్యసమితి పర్యావరణవేత్త ఎరిక్సోల్వెమ్.(ట్విట్టర్లో,4/2/2021)
మల్లన్నసాగర్ అద్భుతం. ఈ ప్రాజెక్టుతోపాటు సిద్దిపేట అభివృద్ధి అబ్బురపరిచేలా జరిగింది.
కేంద్రప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిజేబీ మహాపాత్ర. (సిద్దిపేట, 22/2/2021)
అంతర్జాతీయ విత్తన భాండాగారంగా రూపుదిద్దుకొనేదిశగా తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రశంసనీయం.
-ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బుకార్ టిజానీ. (6/2/2020)
పంటల సాగులో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న నియంత్రిత వ్యవసాయ విధానం వ్యవసాయరంగంలో ఒక ట్రెండ్సెట్టర్.
-నాబార్డు చైర్మన్ డాక్టర్ గోవింద రాజులు చింతల.(హైదరాబాద్, 20/12/2020)
తెలంగాణలో 94 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. వీరికి అందజేస్తున్న కేసీఆర్ కిట్స్ భేష్.
-నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్.(ములుగు, 9/12/2021)
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉన్నది.
-కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా. (హైదరాబాద్, 14/9/2021)
షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు భేష్.
-జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్.(హైదరాబాద్, 11/8/2021)
బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి.
-కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్జయప్రకాశ్ హెగ్డే. (3/12/2021)
రైతు కేంద్రీకృత విధానాలు భేష్. కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వినూత్న పద్ధతుల్లో సాగుకు పెద్దపీట వేయడం గొప్ప విషయం.
-మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదాజీ బుసే. (5/11/2020)