రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సలహాదారు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ అధికారి పెంటారెడ్డి, దేవాదాయశాఖ ఎస్టేట్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారితో పూజలు చేయించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశ్వీరచనం చేసి స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ గంగం శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.