కోల్కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు ఓ అధికారి చెప్పారు. మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.