న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, స్థానిక పోలీసుల సమన్వయంతో అనేక రాష్ర్టాల్లో సోదాలు చేపట్టింది. ఇప్పటివరకు 175 మంది డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసిన సీబీఐ.. 127 కేసులు నమోదుచేసింది.
అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాలను అరెస్టు చేసి, డ్రగ్స్ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడం కోసం సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ను చేపట్టింది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, ఎన్సీబీ ఈ ఆపరేషన్లో 6,600 మంది అనుమానితులను గుర్తించారు. 127 కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆరుగురితోపాటు సుమారు 175 మందిని అరెస్టు చేశారు.