అమరావతి, జూన్ 17: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 11వ రోజు కు చేరుకున్నది. ఈరోజు సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నది. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డితోపాటు మరో మహిళను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్టై కొద్దీ రోజుల క్రితం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు గంగిరెడ్డి. అయితే వివేకానంద హత్య జరిగిన ప్రదేశంలో గంగిరెడ్డి సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని సీబీఐ అధికారులు గురువారం విచారిస్తున్నారు.