హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పారిస్కు వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇవ్వవద్దని కోర్టును సీబీఐ కోరింది. కుమార్తె కాలేజ్ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్ అనుమతి కోరారు. దీంతో జగన్ పారిస్ పర్యటనకు అనుమతి కోరిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్కు పారిస్ అనుమతి ఇవ్వొద్దని, వివిధ కారణాలు చెప్పి విదేశాలకు వెళ్తున్నారని పేర్కొంది. జగన్ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ వెల్లడించిది.