హైదరాబాద్ : లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు మంగళవారం సీబీఐ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన కస్టమ్స్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్ పాల్ను అరెస్టు చేసి అధికారులు.. వారిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితుడు షరతులతో కూడిన బెయిల్పై బయటకు రాగా.. బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. రూ.20వేలు అడిగ్గా.. రూ.10వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు సోమవారం పట్టుకున్నారు.