అగర్తల: పశువుల స్మగ్లర్ను జనం కొట్టి చంపారు. త్రిపురలోని సెపాహిజాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన ముగ్గురు పశువుల స్మగ్లర్లు శుక్రవారం రాత్రి సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని కమల్ నగర్ గ్రామంలోకి ప్రవేశించారు. లిటన్ పాల్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి పశువుల చోరీకి ప్రయత్నించారు. అయితే పొరుగు వ్యక్తి సహాయంతో పశువుల దొంగలను పాల్ పట్టుకున్నాడు.
ఇద్దరు యువకులు తప్పించుకుని పారిపోగా మరో వ్యక్తి దొరికిపోయాడు. దీంతో అతడ్ని స్థానికులు కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం సంఘటనా ప్రాంతానికి వచ్చారు. మృతుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్, కరెన్సీ ఆధారంగా అతడు బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే మృతుడి పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియలేదు.