శ్రీనగర్, అక్టోబర్ 26: టీ-20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో టీమిండియాపై పాక్ జట్టు గెలువడంతో సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై జమ్ముకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద రెండు కేసులు నమోదుచేశారు. స్కిమ్స్ సౌర, కరణ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదుచేసినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. భారత్పై పాక్ జట్టు గెలువడంతో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మానవతా దృక్పథంలో విద్యార్థులపై పెట్టిన యూఏపీఏ కేసులను ఉపసంహరించాలని జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లెఫ్టినెంట్ గవర్నర్కు విజ్ఞప్తిచేసింది. మరోవైపు, పాక్ గెలువడాన్ని కీర్తిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ పెట్టినందుకు రాజస్థాన్కు చెందిన ఉపాధ్యాయురాలు నఫీసాని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీనిపై నఫీసా క్షమాపణలు కోరారు.