ముంబై : ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులు మరో ముగ్గురు పేర్లనూ ఎఫ్ఐఆర్లో ఔరంగాబాద్ పోలీసులు చేర్చారు. ఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్ ఠాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్కు రాజ్ ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు.
మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని గతంలో ముంబై ర్యాలీలో ఆయన మహారాష్ట్ర సర్కార్కు డెడ్లైన్ విధించారు. ఇక గడువు దగ్గరపడిన క్రమంలో ఔరంగాబాద్లో ఆదివారం జరిగిన ర్యాలీలో రాజ్ ఠాక్రే మహా సర్కార్పై విరుచుకుపడ్డారు. 3న ఈద్ దృష్ట్యా మే 4లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని లేకుంటే మసీదుల ఎదుట తమ పార్టీ భారీ శబ్ధంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. మే 4 తర్వాత తాము ఎవరేం చెప్పినా వినిపించుకోమని స్పష్టం చేశారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనిపక్షంలో తమ పద్ధతిలో తాము వెళతామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. మే 4 నుంచి తాను చూస్తూ ఊరుకోనని, అప్పటికి లౌడ్స్పీకర్లు తొలగించకుంఏ మహారాష్ట్ర సత్తా చాటుతామని అన్నారు. ఇది మతపరమైన అంశమని సామాజిక అంశం కాదని స్పష్టం చేశారు. మీరు దీన్ని మతపరమైన అంశంగా మలిస్తే తాము అదే తరహాలో స్పందిస్తామని అన్నారు.