హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు ప్రవాహంలో కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో నవ వధూవరులు నవాజ్రెడ్డి, ప్రవళిక, వరుడి అక్కలు శ్వేత, రాధమ్మ, కారు డ్రైవర్తో పాటు మరో బాలుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్రెడ్డికి మోమిన్పేటకు చెందిన ప్రవళికతో వివాహం జరిగింది. ఆదివారం మోమిన్పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా.. వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. మరో వైపు మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం పుల్మామిడిలో వాగు ఉప్పొంగడంతో బైక్తో పాటు ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.