రంగారెడ్డి : పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వెళ్తున్న సమయంలో పిల్లర్ నెంబర్ 193పైన ఓమ్నీ కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అందులో ఉన్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.