హైదరాబాద్: నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తుండగా కారు బోల్తా పడింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.