నాగర్ కర్నూల్ : రోడ్డు వెంట ఆగి ఉన్న కారును వేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
మృతుడిని, క్షతగాత్రులను హైదరాబాద్లోని చింతకుంట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి