అమరావతి : ప్రయాణికులతో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం నల్లమడ వాగు వంతెన వద్ద శనివారం జరిగింది.
అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు నలిపి ప్రయాణికులతో కిందకు దించాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు పాక్షికంగా దగ్ధమైంది. మరో వాహనంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి