న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రైల్వే రిక్రూట్మెంట్లో అవకతవకలపై విద్యార్థుల నిరసనల పట్ల అధికారులు వ్యవహరించిన తీరును ఓ యువకుడు దుయ్యబడుతున్న వీడియోను వరుణ్గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆర్థికం, వ్యవసాయం తదితర రంగాల్లో కేంద్రం అవలంబిస్తున్న విధానాలను వరుణ్గాంధీ తరచూ ఎండగడుతున్న విషయం తెలిసిందే.