హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి తరలిస్తుండగా.. 320 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి తరలిస్తున్న కర్ణాటకలోని బీదర్కు చెందిన మెట్రి రాజ్కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బొలేరో వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రంగాలాల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి గంజాయి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.40లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.