క్యాన్సర్ చిన్నగా మొదలవుతుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఒక్కసారిగా బయటపడుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. ఈ వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా ఉంటాయి. అందుకే దీన్ని కనిపించని శత్రువుగా పోల్చుతారు. రోజురోజుకూ బాధితులు పెరుగుతున్నారు. వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా మారగా.. ఆహార అలవాట్లు కూడా మరో కారణంగా వైద్యులు చెబుతున్నారు. అధికంగా గొంతు, రొమ్ము, గర్భాశయ వ్యాధులు పెరుగుతున్నాయి. వనపర్తి జిల్లాలో మాత్రం నోటి క్యాన్సర్ ఆందోళన కలిగి స్తున్నది. మగవారితో పోలిస్తే మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్కేసులు ఎక్కువే.
వనపర్తి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నది. అప్రమత్తంగా ఉండాల్సింది మరిచి ఏరికోరి క్యాన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భ్రమ ప డుతూ.. దాని వలలో చిక్కుకుంటున్నారు. మా రిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మ ద్యం సేవించడం, మాంసాహారం తినడం, గు ట్కాలు, పాన్ మసాలాలు నమలడం, ఆలస్య పు వివాహాలు వంటి అంశాలు క్యాన్సర్ బారిన పడేలా చేస్తున్నాయి. సాధారణంగా వృద్ధాప్యం లో కనిపించే జబ్బులు పాతికేండ్లలోపు యువకులకు సోకుతుండడం ఆందోళన కలిగించే వి షయం. రాష్ట్ర వ్యాప్తంగా 48,320 క్యాన్సర్ కే సులు నమోదు కాగా.. కేవలం వనపర్తి జిల్లాలో 222 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యంపై ఇదే రకమైన నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సా యిరెడ్డి తెలిపారు. చాలా మందికి క్యాన్సర్ ఉ న్నా.. బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది ప డుతున్నారన్నారు. తల, మెడ క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆరోగ్య శ్రీ లె క్కల ప్రకారం పట్టణాల్లో ఎక్కువగా విస్తరిస్తున్న ట్లు తేలింది. జిల్లాలో నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. తల, మెడ, రొమ్ము, గ ర్భాశయ ముఖద్వారం, లుకేమియా, పెద్దపేగు, చిన్నపేగు, లంగ్స్, లివర్, థైరాయిడ్, లింపో మా, మలద్వారం, కణజాల సంబంధం, అన్నవాహిక క్యాన్సర్.. వంటి అనేక రకాల వ్యాధులు మనిషి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
క్యాన్సర్కు కారణాలు..
అప్రమత్తంగా ఉండాలి..
క్యాన్సర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఫాస్ట్ఫుడ్ జో లికి వెళ్లకుండా మంచి ఆహారం తీసుకోవాలి. మంచి వాతావరణం లో ఉండాలి. మసాలాలు, వేపుడు పదార్థాలు తగ్గించాలి. మద్యపానం విషయంలో నియంత్రణ పాటించాలి. గొంతు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయల భోజనం రోజువారి మెనూలో ఉండేలా చూసుకోవాలి. కొందరిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నా చాలా రోజుల తర్వాత బయటపడుతున్నది.
– రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి