కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. సరిపడా వర్షాలు లేక బావులన్నీ ఎండిపోయాయి. దీంతో పంటలసాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా బావులు తవ్వుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1,200కంటే ఎక్కువ బావులు ఎండిపోయయని కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తెలిపింది. గతేడాదితో పోల్చితే 50శాతం కంటే ఎక్కువగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 100 బావులు ఎండిపోయాయని సంబంధిత అధికారులు వివరించారు. ప్రపంచంలోని నలుమూలకు పండ్లు, కూరగాయలు, నట్స్ను ఎగుమతి చేసే శాన్ జోక్విస్ వ్యాలీలో భూగర్భ జలక్షీణత చాలా తీవ్రంగా ఉంది.