పనాజీ : దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
అయితే గోవా – కర్ణాటక సరిహద్దుల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో దూద్ సాగర్కు వరద పోటెత్తింది. ప్రమాదవశాత్తు కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న దృష్టి లైఫ్ సేవర్ల బృందం ఆ పర్యాటకులను గమనించి, ప్రాణాలతో కాపాడింది. ఇక గోవా వ్యాప్తంగా నిన్న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గోవా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall.
I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022