నందిపేట్, ఏప్రిల్ 7 : నిజామాబాద్ జిల్లా నందిపేటలో గురువారం ఓ ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. మండలంలోని వన్నెల్(కె) గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సత్యనారాయణ రోజు మాదిరిగా నిజామాబాద్ నుంచి వన్నెల్(కె) గ్రామానికి గురువారం ఎలక్ట్రిక్ బైక్పై బయల్దేరారు. మార్గమధ్యంలో నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైక్ ఆపి ఓ హోటల్లో టిఫిన్ చేస్తున్నారు.
ఇంతలో బైక్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించి మంటలు అంటుకొన్నాయి. వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. సుమారు రూ. 80 వేల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. ఎండ తీవ్రతతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు.