లక్నో : రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూసి ఐఏఎస్ ఆఫీసర్ బోరున విలపించారు. నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరిలో బస్సు – ట్రక్కు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారంతా లఖింపూర్ఖేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ పరామర్శించారు. ఈ సందర్భంగా గాయాలతో చికిత్స పొందుతున్న ఓ బాలుడిని చూసి రోషన్ జాకబ్ కన్నీరు పెట్టుకున్నారు. గాయపడ్డ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH |Lakhimpur Kheri bus-truck collision: Lucknow Divisional Commissioner Dr Roshan Jacob breaks down as she interacts with a mother at a hospital&sees condition of her injured child
At least 7 people died&25 hospitalised in the accident; 14 of the injured referred to Lucknow pic.twitter.com/EGBDXrZy2C
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022