కోల్కతా, సెప్టెంబర్ 10: కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న మోసపూరిత గేమింగ్ యాప్ ఆపరేటర్ల కార్యాలయాలు, ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. శనివారం ఆరు చోట్ల తనిఖీలు జరిగాయి. రూ.17 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దికాలం కిందట ‘ఈ-నగెట్స్’ యాప్ నిర్వాహకులపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
దీని ఆధారంగా మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసుకున్న ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. చైనా కేంద్రంగా సాగుతున్న అక్రమ రుణ యాప్లకు, ఈ యాప్నకు ఏమైనా సంబంధం ఉన్నదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నది.