యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బుద్ధ మురళి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు స్వామి వారి వేద ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భతంగా ఉందని ప్రశంసించారు.