మణుగూరు రూరల్, అక్టోబర్ 13: ఒకవైపు దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్తు కేంద్రాలు మూత పడుతుంటే.. తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలు తమ సామర్థ్యాన్న విస్తరించుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సమీపంలో 1,080 (270X4) మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)ప్లాంట్ పరిధిలో మొత్తం నాలుగు యూనిట్లకు గాను ఇప్పటికే మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. నాలుగో యూనిట్ పరిధిలో లైటప్ పూర్తి కాగా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్) ఎం సచ్చితానందం స్విచ్ ఆన్ చేసి సింక్రనైజేషన్ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి నాలుగో యూనిట్ సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.