హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో ఎంసెట్ జూలై 14 నుంచి 20 వరకు జరగనుండటం, పలు రాష్ట్రాల్లోనూ ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఆలస్యం అవుతుండటంతో తరగతులు ప్రారంభించటం కష్టతరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ర్టాల విజ్ఞప్తుల మేరకు ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ను సవరించి ప్రకటించింది.
తరగతుల నిర్వహణపై ఏఐసీటీఈ విద్యాసంస్థలకే స్వేచ్ఛ ఇచ్చింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ (బ్లెండెడ్మోడ్)లో నిర్వహించుకోవచ్చని సూచించింది. కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని ఆదేశించింది. అనుమతుల కోసం ఏఐసీటీఈ, యూజీసీ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నది.