న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లీగల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. లా డిగ్రీ పట్టా కలిగినవారు అర్హులని పేర్కొన్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అయితే కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టింది. ఎంపికైన అభ్యర్థుల పనితనం, కంపెనీ అవసరాల దృష్ట్యా ఉద్యోగ కాలపరిమితిని రెండు, మూడేండ్ల పాటు పొడిగించే అకాశం ఉన్నది. ఉద్యోగ సమయంలో ప్రతినెల రూ.75 వేలు చెల్లిస్తారు.
అర్హతలు: బార్కౌన్సిల్ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఎల్ఎల్బీ కానీ, ఎల్ఎల్ఎం కానీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 32 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9
వెబ్సైట్: www.bsnl.co.in