ఢిల్లీ ,జూన్ 22: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. తమ వినియోగదారులకు నూతనంగా 4జీ ప్లాన్స్ ప్రకటించింది. అవేంటంటే..?
రూ.499 ధరకు ప్రీపెయిడ్ ప్లాన్…
రూ.499 రీఛార్జ్ చేస్తే 90 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 2జీబీ డేటా వినియోగించుకోవచ్చు. తొంభై రోజులకు 180జీబీ 4జీ డేటాను అందిస్తున్నది. అంతేకాదు ఈ ప్లాన్లోభాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రూ.499 రీఛార్జ్ చేసేవారికి బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్లాన్ కావాలనుకునే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు రూ.499 ప్లాన్ ఉపయోగపడుతుంది.
దీంతో పాటు ఇలాంటి మరిన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ప్రకటించింది బీస్ఎన్ఎల్.
అందులో రూ.94 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్పై 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 90 రోజులకు మొత్తం 3జీబీ డేటా వాడుకోవచ్చు. ఏ నెట్వర్క్కు అయినా 100 నిమిషాల కాల్స్ ఫ్రీ. ఆ తర్వాత కాల్స్పై సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.94 రీఛార్జ్ ప్లాన్పై 60 రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ కాలర్ ట్యూన్ సర్వీస్ లభిస్తుంది. వ్యాలిడిటీ మాత్రమే కావాలనుకునేవారికి రూ.94 ప్లాన్ చాలా ఉపయోగకరంగ ఉంటుంది .