హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈమేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి అక్టోబర్ 3లోపు ఆయా కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. దరఖాస్తు చేసేటప్పుడు సమస్యలొస్తే 9392685856, 7842542216, 9059672216 సంప్రదించాలని కోరారు. వివరాలకు www.knruhs.telangan.gov.inను చూడాలని సూచించారు.