హైదరాబాద్ : ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్డులోని జోధ్పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన నేపథ్యంలో వసంత్ విహార్లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆ భవన్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. 2021, సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.