లండన్, ఏప్రిల్ 29: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లోని బుల్డోజర్ తయారీ కంపెనీని సందర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని మంగళవారం ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. భారత్లో పర్యటించిన బోరిస్ ఓ ప్రైవేటు కంపెనీని సందర్శించడమేంటని నిలదీశారు. కొద్దికాలం నుంచి భారత్లో బుల్డోజర్ సంస్కృతి కొనసాగడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నించారు. దీంతో స్పందించిన అధికార పక్షం భారత్తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని, ఈ సంబంధాలు ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చుతాయని తెలిపింది.