ప్రదానం చేసిన ప్రిన్స్ చార్లెస్
హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్కు బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం లభించింది.
రొమ్ము క్యాన్సర్ చికిత్స, పరిశోధనలో ఆయన చేసిన సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ‘ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్(ఓబీఈ)’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును బుధవారం లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ డాక్టర్ రఘురామ్కు ప్రదానం చేశారు.