2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం బ్రిస్బేన్లో సంబురాలు మొదలయ్యాయి. బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జరిగాయి. మళ్లీ 32 ఏళ్లకు ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. ఆతిథ్య నగరం కోసం జరిగిన ఓటింగ్లో బ్రిస్బేన్కు 72-5 తేడాతో ఓట్లు పోలయ్యాయి. టోక్యో తర్వాత.. 2024లో పారిస్లో.. 2028లో లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్స్ జరగనున్నాయి.