న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందడుగు పడింది. అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి పూర్తిగా వైదొలిగినట్లు శనివారం బీపీసీఎల్ ప్రకటించింది.
ఎన్ఆర్ఎల్లో తనకున్న 61.65 శాతం వాటాను అసోం సర్కార్, ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియానికి విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 9,876 కోట్లు అని తెలిపింది. మొత్తం 61.5 శాతం బీపీసీఎల్ వాటాల్లో ఆయిల్ ఇండియాకు 54.16 శాతం, దాని భాగస్వామి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్)కు 4.4 శాతం వాటాలు ఉన్నాయి.
మిగిలిన వాటాల్ని అసోం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. దీంతో ఎన్ఆర్ఎల్లో ఆయిల్ ఇండియా వాటా 80.16 శాతానికి చేరింది. ‘అసోం శాంతి ఒడంబడిక’ ప్రకారం ఎన్ఆర్ఎల్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఎల్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది. తద్వారా అసోం శాంతి ఒప్పందం ప్రకారం ఎన్ఆర్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగనున్నది.
బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కంపెనీలో మొత్తం తన 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వేదాంత గ్రూప్తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు బీపీసీఎల్ వాటాలను కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!