హరిద్వార్ : విదేశీ బహుళజాతి సంస్థలను బహిష్కరించాలని దేశవాసులకు యోగ గురువు బాబా రామ్దేవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీలు వ్యాపారం పేరిట దోపిడీలు, దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. స్వదేశీ వస్తువులను విరివిగా ఉపయోగించడం ద్వారా విదేశీ సంస్థల మోసాలను అరికట్టవచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన తన ఆలోచనలను మంగళవారం ఇంటర్నెట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. పతంజలి దేశాన్ని కుటుంబంగా చూసుకుంటున్నదని, వైద్యం చేసే స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బాబా రాందేవ్ తెలిపారు. ఈ విదేశీ బహుళజాతి కంపెనీల ముసుగులో, ఒత్తిడిలో కొంతమంది పతంజలి సంస్థ పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి మేమెప్పుడూ భయపడమని చెప్పారు.
త్వరలో పతంజలి సంస్థ దేశంలోనే అతిపెద్ద ఫార్మా, ఎఫ్ఎంసీజీ సంస్థగా అవతరించనున్నదని బాబా రామ్దేవ్ వెల్లడించారు. ఎమ్మెన్సీల నల్ల వ్యాపారాన్ని అంతం చేస్తామని చెప్పారు. బ్రాండెడ్ వస్తువుల పేరిట చాలా కంపెనీలు ఔషధాలను అసలు ధరల కంటే చాలా రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ ఔషధి కేంద్రాలను తెరవవలసి వచ్చిందని తెలిపారు. ఈ దోపిడీ తనను బాధపెడుతుందని బాబా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఆహారం, పానీయాలపై దృష్టి పెట్టడంతో పాటు యోగా చేయాలని ఆయన సాధారణ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదేం పద్ధతి : ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు చెంపదెబ్బ, ఇద్దరు అరెస్టు
యూఎస్ నివేదిక : పెంటగాన్దే అతి పెద్ద ఇంటెలిజెన్స్ ఫోర్స్
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
బాబోయ్ ఎండలు : దుబాయ్లో మండుతున్న సూరీడు
మరింత శక్తి : వచ్చే నెలలో భారత్కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..