ఆ బాలుడు స్కూల్లో పాడిన ‘గులాబీ ఆంఖే’ పాట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అతడు కాస్త పెద్దవాడయ్యాడు. ప్రోగా పాడడం మొదలెట్టాడు. కీబోర్డు వాయించడం కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహబూబ్ ఖాయమత్ హోగీ’ అని అచ్చుగుద్దినట్లు కిశోర్కుమార్లా పాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసారు. ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ చిత్రంలోని హిట్సాంగ్ను ప్రశాంతమైన స్వరంతో పాడుతూ కీబోర్డును ఆ బాలుడు మధురంగా ప్లే చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకు అవనీశ్ శరణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుటికీ ఇప్పటికీ అతడి పాటలో మెచ్యూరిటీ కనిపించిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. “లవ్లీ సాంగ్ అండ్ లవ్లీ సింగర్” అని ఒక యూజర్ రాశారు. “వాహ్ వాహ్” అని మరొకరు కామెంట్ చేశారు.
Made My Day.❤️ pic.twitter.com/SMKj5ZfyHO
— Awanish Sharan (@AwanishSharan) July 8, 2022
— AvneeshVerma (@AvneeshVerma01) July 8, 2022