నారాయణ్ఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ మండలంలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.
చెరువులో స్నానానికి వెళ్లి బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరిని స్థానికులు అతికష్టం మీద రక్షించారు.
నారాయణ్ఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొందరు పిల్లలు ఉదయం హోలీ వేడుకలు జరుపుకొని స్నానం చేసేందుకు శివారులోని చెరువులో స్నానానికి వెళ్లారు.
వీరిలో ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిమునిగారు. ఒకరు మృతిచెందగా.. మరొకరిని స్థానికులు రక్షించారు. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.