హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్లో చిక్కుకొని బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి అంజయ్యనగర్లో బుధవారం ఉదయం ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని భవనంలో టీవీఎస్ షోరూం వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో షట్టర్ ఆటోమేటిక్ రోలింగ్ బటన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా షట్టర్ చుట్టేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అర్జున్ కాంప్లెక్స్లోనే వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.