ఒక్కో కంపెనీలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చాక.. ఫోన్లలో మాట్లాడటానికి వీలు ఉండదు. ఫోన్ స్విచ్ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలాగే.. సోషల్ మీడియాను ఉపయోగించడానికి కూడా వీలు ఉండదు. ఇలా.. కంపెనీని బట్టి రూల్స్ మారుతుంటాయి.
కానీ.. ఒక కంపెనీలో మాత్రం తమ ఉద్యోగులకు బాస్ ఫోన్ చార్జింగ్పై అల్టిమేటం జారీ చేశాడు. ఆఫీసులో ఎవరైనా ఉద్యోగులు తమ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే నెల జీతంలో నుంచి కట్ చేస్తామని నోటీసులు జారీ చేశాడు. ఆఫీసులో ఫోన్లు కానీ.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లు కానీ చార్జింగ్ చేయడానికి వీలు లేదు. అలా చేస్తే అది ఎలక్ట్రిసిటీని దొంగలించినట్టే. అలా చేసిన వాళ్ల జీతంలో నుంచి కొంత అమౌంట్ కట్ చేస్తామని ఒక కంపెనీ బాస్.. ఉద్యోగులకు నోటీసు పంపించాడు.
దాన్ని చూసి ఉద్యోగులంతా కంగుతిన్నారు. ఆ నోటీసు ప్రస్తుతం రెడిట్లో వైరల్ అవుతోంది. ఇలాంటి బాస్లు కూడా ఉంటారా? ఈయనేం బాస్.. ఫోన్లలో చార్జింగ్ పెట్టుకుంటే.. పని ఏమైనా ఆగుతోందా? అయినా చార్జింగ్ పెట్టుకుంటే కరెంట్ బిల్లు ఏమైనా పెరుగుతుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటో ఇప్పటిది కాదు.. మూడేళ్ల క్రితం నాటిది కానీ.. తాజాగా ఓ రెడిట్ యూజర్.. ఆ నోటీసును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు.. వైరల్ వీడియో
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
తల్లికి డెలివరీ చేసి తన పుట్టుకకు కారణం అయిన డాక్టర్పై కేసు పెట్టిన యువతి
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు