యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, రక్షణ రంగాలకు సంబంధించి, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడం, వ్యూహాత్మక రక్షణ రంగ చర్యలు, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం.. లాంటి విషయాలపై ఇరు దేశాల నేతలు లోతుగా చర్చిస్తారని ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
కొన్ని నిరంకుశత్వ దేశాలు బెదిరింపులకు దిగుతున్నాయని, ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్ర దేశాలు ఓ చోటకు రావాల్సిన అవసరం ఉందని యూకేఅధికారి జాన్సన్ పేర్కొంటున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో బ్రిటన్, భారత్.. రెండూ విభిన్న దృక్పథాలను కలిగి వున్నాయి. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.