ముంబై : ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు హెడ్ కోచ్గా షేన్ బాండ్ను నియమిస్తున్నట్లు యాజమాన్యం శనివారం ప్రకటించింది. వచ్చే జనవరిలో జరిగే తొలి ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ20) చాంపియన్షిప్లో ముంబై ఇండియన్స్ జట్టు పాల్గొననున్న సంగతి తెలిసిందే. బాండ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. అతనికి సహాయంగా పృథ్వి పటేల్ బ్యాటింగ్ కోచ్గా, వినయ్కుమార్ బౌలింగ్ కోచ్గా, జేమ్స్ ఫ్రాంక్లిన్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించనున్నారు.