ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు బెయిల్ను వచ్చే నెల 5 వరకు బాంబే హైకోర్టు పొడిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే పలుసార్లు ఈ బెయిల్ను పొడిగించిన హైకోర్టు శుక్రవారం కూడా మరోసారి పొడిగించింది. ‘ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలతోపాటు పోలీసులు, ఆరోగ్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో వరవరరావును జైలులో లొంగిపోవాలని ఆదేశించడం సరికాదు. అందుకే సమయాన్ని పొడిగిస్తున్నాం’ అని హైకోర్టు పేర్కొంది.