Mahesh Babu-rajamouli Project | భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో టాలీవుడ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టిక్కెట్ రేట్ ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రేక్షకులు ఖర్చు పెట్టిన దానికి జక్కన్న రెండింతలు ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకం. కేవలం పోస్టర్ పైన రాజమౌళి పేరుంటే చాలు హీరో ఎవరా? అన్నది కూడా ఆలోచించకుండా ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ మరో సారి రాజమౌళి ప్రతిభ ఏంటో నిరూపించింది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్దమౌతున్నాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రీప్ట్ పనులు ఇప్పటికే పూర్తయిపోయినట్లు టాక్. రాజమౌళి ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసిన పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో మహేష్బాబుకు సమానంగా విలన్ రోల్ ఉండనుందట. నిజానికి రాజమౌళి సినిమాలో విలన్లు హీరోలను డామినేట్ చేసే విధంగా ఉంటారు. ఈ చిత్రంలో కూడా విలన్ పాత్ర అలానే ఉండనుందట. ఈ క్రమంలోనే రాజమౌళి బాలీవుడ్లోని ఓ స్టార్ను విలన్గా ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుపుతున్నాడట. ఇప్పటికే ఆ స్టార్ హీరోతో చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. గతంలో చియాన్ విక్రమ్ను ఈ పాత్ర కోసం ఎంపికచేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలాయి. ఇక ఈ చిత్రం డిసెంబర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. మహేష్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.