హైదరాబాద్ : ఇటీవల మృతి చెందిన శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ విజయలక్ష్మి చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.
మంగళవారం జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.