నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత చొరవతో మస్కత్ నుంచి నిజామాబాద్ జిల్లా వాసి మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండకు చెందిన హర్షత్ హుస్సేన్ పొట్టకూటి కోసి మస్కట్ వలస వెళ్లాడు. అయితే నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో అక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అక్కడి నుంచి స్వదేశానికి హుస్సేన్ మృతదేహం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి అతని మృతదేహం చేరుకున్నది. అక్కడి నుంచి అంబులెన్సులో సిరికొండకు పంపించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి మృతదేహాన్ని గ్రామానికి పంపించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేకు హుస్సేన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.