న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటోరి ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2021కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్కు, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి మధ్య మరో వివాదానికి తెర లేచింది.
బుధవారం ఈ బిల్లుపై రాజ్యసభలో గందరగోళం జరిగింది. విపక్షం వాకౌట్ చేయడంతో రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అంతకుముందు ఈ నెల 22వ తేదీన లోక్సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు.
ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి అధికారాలను లాగేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని కేజ్రీవాల్ మండిపడ్డారు. గవర్నర్కు అధికారాలు కల్పించి, తెర వెనుక నుంచి పాలన సాగించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఇక నుంచి ఆప్ సర్కార్ ఏదేనా నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి శాసనంగా మార్చాలి. ఏదైనా కార్య నిర్వాహక నిర్ణయం అమలు చేయాలంటే తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ సమ్మతి పొందాల్సిందే. ఇంతకుముందు కూడా ఢిల్లీ సీఎంకు, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య పలు దఫాలు వివాదాలు నెలకొన్నాయి.
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
రిలయన్స్ సహా టాప్-7 ఎం-క్యాప్ రూ.1.07 లక్షల కోట్లు హరీ